నాకు ఈ వయసులో కూడా అర్ధం ఐనట్టే వుండి ఏ మాత్రం అర్ధం కాని వేదాంతాన్ని,
శంకరాచార్యుల వారు తన పన్నెండవ ఏటనే ఔపోసన పట్టి,
ముప్పైరెండేళ్లకే దేశపు నలుమూలలనీ కలియ చుట్టి,
ప్రస్థాన త్రయాలైనట్టి ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీతలకు భాష్యాలు చెప్పి,
మూఢవిశ్వాసాలలో మునిగిపోతూ దారితప్పిన సమాజానికి సన్మార్గాన్ని చూపి,
ఆనాటికే మరుగున పడుతున్న సనాతన ధర్మానికి సరికొత్త ఊపిరులూది,
“అంతా ఒక్కటే” అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించిన..
తత్వవేత్తలకే మార్గదర్శి..
గురువులకే గురువు..
జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతి సందర్బంగా..
అందరికీ ఆత్మజ్ఞాన సిద్ధిరస్తు!